Tuesday, 28 July 2026 12:58:52 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

ఇందిరమ్మ ఇళ్లపై కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా..?

పేదల ఇంటి కలకు గండి..!

Date : 22 July 2026 12:29 PM Views : 214

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చెలిమెల కొలం గుడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన తొలి దశలోనే నిలిచిపోయాయి. పునాదులు వేసిన తర్వాత నెలలు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పునాదుల్లో నీరు నిలిచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామస్థుల కథనం ప్రకారం, కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్లకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏఈని నియమించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కనిపించడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై తిర్యాని ఎంపీడీవోను వివరణ కోరగా, కాంట్రాక్టర్లను పలుమార్లు సంప్రదించినప్పటికీ వారు స్పందించడం లేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాని లబ్ధిదారులు నేరుగా తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని, అందిన ఫిర్యాదులను పరిశీలించి జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురికాకుండా నిలిచిపోయిన నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించి, బాధ్యులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :