Tuesday, 28 July 2026 08:05:34 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Date : 24 June 2026 08:34 PM Views : 149

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులములకు చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 39 సంవత్సరాల లోపు న్యాయ శాస్త్ర పట్టభద్రులకు 3 సంవత్సరాల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని, శిక్షణ కాలంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంధాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకసారి 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల న్యాయ శాస్త్ర పట్టభద్రులు ఆన్ లైన్ లో EPASS-https://Telanganaepass.cgg.gov.in లో జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు భారత్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండాలని, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్లు మీ -సేవా ద్వారా జారీ చేయబడిన ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత దరఖాస్తు, పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని తెలిపారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: