Wednesday, 29 July 2026 05:45:11 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​ఎన్.హెచ్.ఎం సమస్యలు పరిష్కరించాలి: మంత్రి వివేక్‌కు ఉద్యోగుల వినతి

Date : 14 June 2026 04:42 PM Views : 184

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గత రెండు దశాబ్దాలుగా వైద్య రంగంలో నిరంతర సేవలు అందిస్తున్న తమ న్యాయమైన డిమాండ్లను, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు.ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్‌ను ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు, జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఉద్యోగ భద్రత & క్రమబద్ధీకరణ: 20 ఏళ్లుగా కొనసాగుతున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలి. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలి. నిలిచిపోయిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి. రిటైర్మెంట్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలి.రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని 78 కేడర్లలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో మగ్గుతున్నారు. మా సమస్యలు ఎన్నేళ్లయినా పరిష్కారానికి నోచుకోవడం లేదు.ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం జేఏసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా, మరియు మండల స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :