వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గత రెండు దశాబ్దాలుగా వైద్య రంగంలో నిరంతర సేవలు అందిస్తున్న తమ న్యాయమైన డిమాండ్లను, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు.ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్ను ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు, జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఉద్యోగ భద్రత & క్రమబద్ధీకరణ: 20 ఏళ్లుగా కొనసాగుతున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలి. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలి. నిలిచిపోయిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలి. రిటైర్మెంట్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలి.రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని 78 కేడర్లలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు గత 20 ఏళ్లుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో మగ్గుతున్నారు. మా సమస్యలు ఎన్నేళ్లయినా పరిష్కారానికి నోచుకోవడం లేదు.ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం జేఏసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా, మరియు మండల స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం