వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్ ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 14 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం