Wednesday, 29 July 2026 11:24:25 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​సింగరేణిలో సెగలు కక్కుతున్న 'ఫైర్ కోల్'.. ప్రాణాపాయంలో కార్మికులు!

Date : 03 May 2026 11:15 PM Views : 147

వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : సింగరేణి సంస్థ పరిధిలోని ఓసిపి -III, సిహెచ్ పి (ర్ జి -2) ఏరియాలో కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత గాలిలో దీపంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న 'ఫైర్ కోల్' (మండుతున్న బొగ్గు) కారణంగా వెలువడుతున్న విపరీతమైన ధూళి, పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యపై సి హెచ్ పి అఖిలపక్షం ఆధ్వర్యంలో డైరెక్టర్ (ఆపరేషన్స్)కు వినతి పత్రం సమర్పించారు. మండుతున్న బొగ్గు నుంచి వచ్చే పొగ వల్ల కార్మికులు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా మారుతోందని ట్రేడ్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 1.75 కోట్ల భారీ వ్యయంతో 2023లో ఏర్పాటు చేసిన 'డస్ట్ సెపరేషన్ సిస్టమ్'ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. ఇది ఏమాత్రం పనిచేయకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతోంది. ​ ఫైర్ కోల్ వల్ల సుమారు 16,000 బంకర్లు దెబ్బతినడమే కాకుండా, స్లో ఫీడర్లు కాలిపోతున్నాయి. దీనివల్ల బొగ్గు రవాణాకు ఆటంకం కలిగి సంస్థకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. వేడి బొగ్గు కారణంగా పలువురు అధికారులు, కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి.సమస్యకు శాశ్వత పరిష్కారంగా పూర్తిస్థాయిలో వాటర్ పాండ్స్ ఏర్పాటు చేయాలి.ఫైర్ కోల్‌ను ఆ పాండ్స్‌లో నింపి లిఫ్టింగ్ చేయడం ద్వారా మంటలను, పొగను నియంత్రించాలి.డస్ట్ సెపరేషన్ సిస్టమ్‌కు అవసరమైన నీటి వనరులను సమృద్ధిగా కల్పించాలి. ​యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :