వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: ప్రజలకు సకాలంలో రేషన్ బియ్యం అందేలా ఎం.ఎల్.ఎస్. పాయింట్ గోదాం నుంచి ధాన్యం లోడింగ్, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్ మండలం తీగల్పహాడ్లోని ఎం.ఎల్.ఎస్. పాయింట్ గోదామును పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, లోడింగ్, రవాణా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, డీలర్లకు వీలైనంత త్వరగా సరఫరా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా స్టేజ్-2 గుత్తేదారు, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం