వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజూరాబాద్ పట్టణంలోని ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంపై అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం సంచులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ప్రజలకు ఉచితంగా అందించాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం సంచులను అధికారులు సీజ్ చేసి, సంబంధిత దుకాణదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా లేదా నిల్వలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం