వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాగజ్నగర్ మండలంలో ఎరువుల దుకాణాలపై మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కేంద్రాల్లో తగినంత ఎరువుల నిల్వలు ఉంచి సరఫరా చేస్తున్నారు. ఎవరైనా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచనలు ఇచ్చారు.
Admin
వాస్తవ గమ్యం