వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పిజి హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నైతం కృష్ణారావును ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గిన్నెధరి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పిజి హెడ్మాస్టర్గా పనిచేస్తున్న కృష్ణారావు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో శనివారం జరిగిన ఎన్నికల సభలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఉద్ధవ్, చీఫ్ అడ్వైజర్గా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు.టి ఎస్ టి డబ్ల్యు ఎ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ. అనే బదులు రాథోడ్ రవీందర్ గిరిజన విద్యాభివృద్ధి, పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కార్యవర్గంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.నైతం కృష్ణారావు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గిరిజన విద్యారంగ అభివృద్ధికి నిబద్ధతగా సేవలందిస్తానని స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం