Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన చైర్మన్గా మందమర్రి పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మందమర్రి పట్టణంలో సుదీర్ఘ కాలంగా ప్రజాసేవలో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పైడిమల్ల నర్సింగ్ కి ఈ పదవి దక్కడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు మరియు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆయన నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూన్నారు. నర్సింగ్ సమర్థవంతమైన నాయకత్వంలో జిల్లాలో ఎస్సీ సెల్ మరింత బలోపేతం అవుతుందని, అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తారని ఆకాంక్షించారు.
Admin
Vastava Gamyam