వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన దహేగామ శశాంక్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)-2025 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో 78వ ర్యాంకు సాధించిన ఆయన, తెలంగాణ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా గర్వపడేలా చేశారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా, తుది జాబితాలో నిలిచిన 148 మందిలో శశాంక్ చోటు సంపాదించుకున్నారు. జేఎన్టీయూ హైదరాబాద్లో ఎం.టెక్ (ఈసీఈ) పూర్తి చేసిన శశాంక్, ఎన్టీపీసీ రిటైర్డ్ పర్యావరణ అధికారి ఉమా మహేశ్వర్, న్యాయవాది నాగలక్ష్మి దంపతుల కుమారుడు. తండ్రి స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణపై మక్కువ పెంచుకున్న ఆయన, దేశ సేవలో తనవంతు పాత్రను నిజాయితీగా పోషిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు 24 నుంచి ఉత్తరాఖండ్లో శిక్షణ ప్రారంభం కానుండగా, అనంతరం ఆయన విధుల్లో చేరనున్నారు. రాష్ట్రస్థాయిలో టాపర్గానిలిచిన శశాంక్ను గ్రామస్థులు, ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
Admin
వాస్తవ గమ్యం