Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్లో అగ్నిప్రమాదానికి గురైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. ప్రమాదంలో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన రెండు కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.95,100 చొప్పున, పాక్షికంగా నష్టపోయిన మరో కుటుంబానికి రూ.9 వేల ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం హౌసింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
Admin
Vastava Gamyam