వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రజలకు ఉపయోగపడలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్ యాదవ్, కోవ విజయ్ కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం-జన్మన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల కింద నిర్మించిన ఇళ్లను ‘ఇందిరమ్మ ఇళ్లు’గా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై సీఎం స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికల హామీలైన గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
Admin
వాస్తవ గమ్యం