వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : రెబ్బెన మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగడం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మాదాసు రవీందర్ ఎన్నికయ్యారు. అలాగే మండల యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఇంగు సాయి, ప్రధాన కార్యదర్శిగా ఎరువోతుల నాగేశ్వర్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం