Wednesday, 29 July 2026 09:00:36 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​సింగరేణి నిర్వాసితుల ఉపాధిపై పాలకుల నిర్లక్ష్యం

220 కుటుంబాల రోదన పట్టదా?

Date : 11 April 2026 06:56 PM Views : 168

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రిలో సింగరేణి ప్రభావిత ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పాలకుల మాటలు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమయ్యాయా? అని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ నిలదీశారు. గత రెండు నెలలుగా ఉపాధి కోల్పోయి 220 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు వీధిన పడి రోదిస్తున్నా, అటు అధికారులు గానీ, ఇటు పాలకులు గానీ పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన మండిపడ్డారు. ​తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేపట్టిన నిరసన దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా శనివారం కెకె-5 గని పై కార్మికుల సమక్షంలో భిక్షాటన చేపట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.సింగరేణి మనుగడ కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన భూనిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పిన యజమాన్యం, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి 220 కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణం. అవసరం తీరాక 'బొడమల్లన్న' చందంగా వ్యవహరించడం పాలకులకు తగదు. రేపు మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకుని హామీలు ఇస్తారు?ఏరియా జనరల్ మేనేజర్ మానవతా దృక్పథంతో ఆలోచించి, 123 పోస్టులతో కొత్త టెండర్లను పిలిచి, బాధితులందరికీ ఉపాధి భరోసా కల్పించాలి.కార్మిక గుర్తింపు సంఘం ఐ న్ టీ యూ సి మరియు ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ లు ఇంతమంది కార్మికులు రోడ్డున పడితే స్పందించకపోవడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే. ఇప్పటికైనా ఈ పోరాటానికి వారు మద్దతు తెలపాలి. ​"భూములు పోయి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉన్న చిన్న ఉద్యోగాన్ని కూడా లాక్కోవడం సరైనది కాదు. తక్షణమే సెక్యూరిటీ గార్డుల సమస్యను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం." అని దూలం శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ​ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :