వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో సోమవారం మధ్యాహ్నం ఎడవెల్లి పరిసర ప్రాంతాల్లో నమ్మదగిన సమాచారం మేరకు రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ. పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 14వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎర్ర మహేష్, ముంజం మల్లేష్, రమేష్, రమేష్ సంఘటన స్థలంలో పట్టుపడగా మిగతా ముగ్గురు తిరుపతి, సతీష్, సురేష్ వీరు పరారీలో ఉన్నారని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బెట్టింగ్, పేకాట ఆడటం చట్ట విరుద్ధమని, పేకాట ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం