Saturday, 12 September 2026 04:51:24 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను ఉద్యమకారుల గుర్తించాలి

Date : 12 July 2026 03:47 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎం. కోదండరాంకు వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన కోదండరాంకు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు 38 రోజుల పాటు వేతనాలు కోల్పోయి సమ్మెలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఉద్యమకారుల హోదా కల్పించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 250 గజాల ఇంటి స్థలం, రూ.50 వేల పెన్షన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు, బస్సు-రైలు ప్రయాణంలో ఉచిత సౌకర్యం, ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం తదితర సంక్షేమ పథకాలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని నాయకులు కోరారు.అదేవిధంగా, సకల జనుల సమ్మె సమయంలో కొంతమంది కార్మికులకు మాత్రమే స్పెషల్ లీవ్ మంజూరు చేసి వేతనాలు చెల్లించారని, వేలాది మంది కార్మికులు సిక్ లీవ్ వినియోగించుకున్నందున వారికి కూడా స్పెషల్ లీవ్‌గా పరిగణించి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చించి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు ఎం. అంజయ్య, దేవులపల్లి రామస్వామి, మేడ రాజలింగు, రాజు, టీ. జనార్దన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :