Tuesday, 28 July 2026 03:08:36 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను ఉద్యమకారుల గుర్తించాలి

Date : 12 July 2026 03:47 PM Views : 36

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ఎం. కోదండరాంకు వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి హాజరైన కోదండరాంకు సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జేఏసీ పిలుపు మేరకు సింగరేణి కార్మికులు 38 రోజుల పాటు వేతనాలు కోల్పోయి సమ్మెలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఉద్యమకారుల హోదా కల్పించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు 250 గజాల ఇంటి స్థలం, రూ.50 వేల పెన్షన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు, బస్సు-రైలు ప్రయాణంలో ఉచిత సౌకర్యం, ఉచిత విద్య, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం తదితర సంక్షేమ పథకాలను సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని నాయకులు కోరారు.అదేవిధంగా, సకల జనుల సమ్మె సమయంలో కొంతమంది కార్మికులకు మాత్రమే స్పెషల్ లీవ్ మంజూరు చేసి వేతనాలు చెల్లించారని, వేలాది మంది కార్మికులు సిక్ లీవ్ వినియోగించుకున్నందున వారికి కూడా స్పెషల్ లీవ్‌గా పరిగణించి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంతో చర్చించి న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఏ. గంగయ్య, నాయకులు ఎం. అంజయ్య, దేవులపల్లి రామస్వామి, మేడ రాజలింగు, రాజు, టీ. జనార్దన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :