వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహేటి ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సమన్వయంతో జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నికితా పంత్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ప్రాంతాన్ని పరిశీలించారు.సీఎం పర్యటన సందర్భంగా భద్రత, రాకపోకలు,పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, వేదిక ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం