వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ (ఆర్టిజన్) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.మంచిర్యాల విద్యుత్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ప్రత్యేక సర్వీస్ రూల్స్' వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం సరికాదని విమర్శించారు.పర్మినెంట్ సేవల కింద పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలి.సంస్థలో అందరితో సమానంగా సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.కర్ణాటక ఉమాదేవి కేసు తీర్పును ప్రస్తావిస్తూ, మానవత్వంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ నేతలు రవీందర్, ఎండి మతీన్ ఖాన్, గాజుల శంకర్, ఆయిల్ల లక్ష్మణ్, నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం