Wednesday, 29 July 2026 11:24:26 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​మందమర్రిలో సహారా బాధితుల భారీ ధర్నా:

"మా డబ్బులు మాకు చెల్లించాలి"

Date : 13 April 2026 03:03 PM Views : 331

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు సోమవారం నాడు బాధితులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు గడుస్తున్నా,యాజమాన్యం తమ డబ్బులు చెల్లించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లేకార్డులతో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టపడి దాచుకున్న సొమ్మును అడగడానికి వస్తే అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లక్షలాది మంది సహారా బాధితుల సమస్యల పరిష్కారం కోసంగడ్డం వివేక్ వెంకటస్వామి(రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి)గడ్డం వంశీకృష్ణ(పెద్దపల్లి ఎంపీ) ​జిల్లాలోని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమ డిపాజిట్లను వడ్డీతో సహా ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సహారా ఇండియా మేనేజర్‌కు అందజేశారు. ​"మా డబ్బులు మాకు చెల్లించకపోతే, జిల్లా వ్యాప్తంగా శాంతియుత మార్గంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.అని గజెల్లి వెంకటయ్య, బాధితుల సంఘం ప్రతినిధి అన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్యతో పాటు సహారా బాధితులు సిహెచ్. సంజీవ్, డి. రాజమౌళి, రామ్ నరేష్ బాబు, సిహెచ్. సంపత్, ఎస్. మధు, దుర్గం మల్లేశ్వరి, భేరి రమాదేవి, దూత లక్ష్మి, పాషా, అబేదా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :