Sunday, 13 September 2026 07:34:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మందమర్రిలో సహారా బాధితుల భారీ ధర్నా:

"మా డబ్బులు మాకు చెల్లించాలి"

Date : 13 April 2026 03:03 PM Views : 366

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని సహారా ఇండియా కార్యాలయం ముందు సోమవారం నాడు బాధితులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితి ముగిసి నాలుగైదేళ్లు గడుస్తున్నా,యాజమాన్యం తమ డబ్బులు చెల్లించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లేకార్డులతో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టపడి దాచుకున్న సొమ్మును అడగడానికి వస్తే అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లక్షలాది మంది సహారా బాధితుల సమస్యల పరిష్కారం కోసంగడ్డం వివేక్ వెంకటస్వామి(రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి)గడ్డం వంశీకృష్ణ(పెద్దపల్లి ఎంపీ) ​జిల్లాలోని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమ డిపాజిట్లను వడ్డీతో సహా ఇప్పించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సహారా ఇండియా మేనేజర్‌కు అందజేశారు. ​"మా డబ్బులు మాకు చెల్లించకపోతే, జిల్లా వ్యాప్తంగా శాంతియుత మార్గంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.అని గజెల్లి వెంకటయ్య, బాధితుల సంఘం ప్రతినిధి అన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్యతో పాటు సహారా బాధితులు సిహెచ్. సంజీవ్, డి. రాజమౌళి, రామ్ నరేష్ బాబు, సిహెచ్. సంపత్, ఎస్. మధు, దుర్గం మల్లేశ్వరి, భేరి రమాదేవి, దూత లక్ష్మి, పాషా, అబేదా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :