Tuesday, 28 July 2026 05:30:17 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

వర్షాకాలం నేపథ్యంలో మందమర్రిలో ముందస్తు చర్యలు,

ప్రజలకు మున్సిపాలిటీ కీలక సూచనలు

Date : 20 June 2026 01:25 PM Views : 165

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందమర్రి మున్సిపాలిటీ ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఈ మేరకు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల బయటకు రావద్దని, లోతైన గుంతలు, కాల్వలు, మురుగు ప్రవాహ ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ముందస్తుగా మున్సిపల్ కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మున్సిపల్ హెల్ప్‌లైన్ 1800-425-3611, ల్యాండ్‌లైన్ 08736-293611 లేదా సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.వర్షాకాల అత్యవసర పరిస్థితులను. ఎదుర్కొనేందుకు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, శిథిల గృహాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :