వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందమర్రి మున్సిపాలిటీ ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఈ మేరకు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల బయటకు రావద్దని, లోతైన గుంతలు, కాల్వలు, మురుగు ప్రవాహ ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ముందస్తుగా మున్సిపల్ కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మున్సిపల్ హెల్ప్లైన్ 1800-425-3611, ల్యాండ్లైన్ 08736-293611 లేదా సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.వర్షాకాల అత్యవసర పరిస్థితులను. ఎదుర్కొనేందుకు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, శిథిల గృహాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం