Saturday, 13 June 2026 10:45:39 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

సమానత్వంకై మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయం

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Date : 11 April 2026 07:16 PM Views : 89

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : సామాజిక న్యాయం, విద్యా విస్తరణ, సమానత్వం కోసం మహాత్మ జ్యోతిబాపూలే చేసిన కృషి చిరస్మరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, వివిధ శాఖల అధికారులు, బి. సి. సంఘాల ప్రతినిధులతో కలిసి మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, విద్యా విస్తరణ, సమానత్వం కోసం మహాత్మ జ్యోతిబాపూలే విశేష కృషి చేశారని తెలిపారు. పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో సమానత్వం కోసం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వివిధ బి.సి. సంఘాల ప్రతినిధులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :