Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : కుమరం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గంగాపూర్ రైల్వే గేట్ (నెంబర్ 71) వల్ల స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. ఇటీవలే జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు భూసేకరణ సమస్యను వివరించారు.దీనికి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, ఈరోజు (బుధవారం, 10/06/2026) రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వచ్చి ఆర్ఓబీ భూమి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నా.రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కి,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కి,రైల్వే బోర్డు మెంబర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం కి.రెబ్బెన మండల ప్రజలు, మరియు భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
Vastava Gamyam