వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 5: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్),చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించనున్న నేపథ్యంలో, మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది అత్యంత సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఇలాంటి నిర్బంధ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముందస్తు అరెస్టుకు గురైన బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్,ఎం.డి. అబ్బాస్,కొంగల తిరుపతిరెడ్డి,పల్లె నర్సింగ్,కనకం రవి,సీపెల్లి రాజలింగు,దాసరి రాజనర్సు,ఎల్పుల కిరణ్,మొగురం శ్రీనివాస్,కోడెం శ్రీనివాస్,అఖిలేష్ పాండే,వెంకటేశ్వర్లు
Reporter
వాస్తవ గమ్యం