వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2010లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బాల్య స్నేహితులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాఠశాల రోజుల నాటి మధుర జ్ఞాపకాలను, ఉపాధ్యాయుల బోధనలను నెమరువేసుకున్నారు.ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన తామంతా.సుమారు దశాబ్దంన్నర కాలం తర్వాత మళ్లీ ఇలా కలవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సమ్మేళనం తమ స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
Admin
వాస్తవ గమ్యం