Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలంలోని నర్సింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థలాల కొలతల ప్రక్రియ మంగళవారం సాగింది. ఈ కీలక విధుల్లో నిమగ్నమైన గ్రామ పంచాయతీ కార్యదర్శి సుప్రియ, తన చంటిపాపను చూసుకోవడం పనుల మధ్య ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు మానవీయత చాటుకున్నారు. ఆమె విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని లాలించి ఆడించారు. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి కూడా సిబ్బంది పట్ల ఆయన చూపిన ఈ సానుకూల దృక్పథం, బాధ్యతాయుత తీరును స్థానికులు, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు
Admin
Vastava Gamyam