Tuesday, 28 July 2026 12:57:16 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

Date : 20 July 2026 04:45 PM Views : 20

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ బి ఐ తరహాలో యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 70 సంవత్సరాల లోపు యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రమాద బీమా సౌకర్యంపై బ్యాంకు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి పెన్షన్‌దారులకు ప్రమాద బీమా, సహజ మరణ బీమా వర్తిస్తుందా లేదా అనే విషయంపై పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నస్పూర్ శాఖ మేనేజర్ బోగే సాగర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ. శ్రీహరి, ఎన్. సదాశివ, ఎండి. ఖాదర్, హుస్సేన్, ఈ. రాజనర్సు, రేకుల పర్వతాలు, బి. ఒదయ్య, ఎస్‌డీ అబ్బాస్ అలీ, బాజీరెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి. లక్ష్మయ్య, కె. పోచయ్య, ఎస్. బాణయ్య, కె. దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.నిరసన సందర్భంగా "రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి", "సహజ మరణానికి రూ.10 లక్షల బీమా అమలు చేయాలి", "సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :