వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ బి ఐ తరహాలో యూనియన్ బ్యాంక్లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షన్దారులకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 70 సంవత్సరాల లోపు యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రమాద బీమా సౌకర్యంపై బ్యాంకు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి పెన్షన్దారులకు ప్రమాద బీమా, సహజ మరణ బీమా వర్తిస్తుందా లేదా అనే విషయంపై పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నస్పూర్ శాఖ మేనేజర్ బోగే సాగర్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ. శ్రీహరి, ఎన్. సదాశివ, ఎండి. ఖాదర్, హుస్సేన్, ఈ. రాజనర్సు, రేకుల పర్వతాలు, బి. ఒదయ్య, ఎస్డీ అబ్బాస్ అలీ, బాజీరెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి. లక్ష్మయ్య, కె. పోచయ్య, ఎస్. బాణయ్య, కె. దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.నిరసన సందర్భంగా "రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి", "సహజ మరణానికి రూ.10 లక్షల బీమా అమలు చేయాలి", "సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Reporter
వాస్తవ గమ్యం