Friday, 11 September 2026 02:46:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్

Date : 22 August 2026 07:43 PM Views : 60

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏ,ఐ,టి,యు,సి రాష్ట్ర నాలుగవ మహాసభలు సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు కరీంనగర్లో జరుగుతాయని,కొమరం భీం జిల్లాలోని అన్ని విభాగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ పిలుపునిచ్చారు.శనివారం ఆసిఫాబాద్లోని ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి వాల్ పోస్టర్లు విడుదల విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిందని నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి 44 కార్మిక చట్టాలు సాధించిందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్మికులను,కర్షకులను ఐక్యం చేసి పోరాటం చేసిందని,భారతదేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన ఏకైక కార్మిక సంఘం ఏ,ఐ,టి,యు,సి అని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని,కార్మిక వ్యతిరేక అయిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని అన్నారు,ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ ఎత్తివేయాలని, కనీస వేతనం 26,000,సమాన పనికి సమాన వేతనం,ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు, ఈ,ఎస్ఐ, గ్రాట్యుటీలపై సీలింగును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు,ఆర్టీసీ కార్మికులపై రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని,వాటిని ఆపాలని అన్నారు,ఈ మహాసభలకు ఏఐటీయూసీ జాతీయ నాయకులు పాల్గొంటారని జిల్లాలోని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నరేష్ ,ఆర్పిసింగ్,నారాయణ,షఫీ,హైమద్,శేఖర్ టు పాటు తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :