వాస్తవ గమ్యం / తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలో గత 18 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో సెకండ్ ఏఎన్ఎంలు ఆయనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన 5,000 మంది ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ పోస్టులను, అదనంగా మరో 1,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.ఈ సమస్యలను త్వరలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం స్పందించకపోతే 5,000 మంది ఏఎన్ఎంలతో కలిసి ‘అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పులి శ్రీలత, చింత విజయ, అనసూయ, కృష్ణవేణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం