Tuesday, 28 July 2026 05:29:52 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఓట్ల సర్వే నిబంధనల ప్రకారం జరగాలి.

టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్.

Date : 16 July 2026 03:47 PM Views : 78

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బి ఆర్ ఎస్ మాజీ భీమారం మండల పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ అన్నారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బి ఎల్ ఓ లు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి, అవసరమైన ఫారాలు నింపించి, వాటికి సంబంధించిన రిసీవ్డ్ కాపీని ఓటర్లకు అందజేయాల్సి ఉంది. అయితే భీమారం గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామాలలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు.అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతోందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ బి ఎల్ ఎ లకు మాత్రమే ఫారాలు అందించి, ఇతర రాజకీయ పార్టీల బి ఎల్ ఎ లకు సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు.భీమారం గ్రామ పంచాయతీలో బిఎల్ఓ లను ఒకేచోట కూర్చోబెట్టి ప్రజలను అక్కడికే రమ్మని చెప్పడం, వచ్చిన ఓటర్లతో నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించడం జరుగుతోందని పలువురు ఓటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. “చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు” అనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దీనిపై రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.గడువు పొడిగించిన నేపథ్యంలో బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని కలగూర రాజకుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాసరి మణి దీపక్, మాజీ వైస్ ఎంపీపీ జనంపల్లి సమ్మయ్య, సీనియర్ నాయకులు చిప్ప పురుషోత్తం, సూరం లచ్చన్న, యువ నాయకులు కుంబ్రే బబ్లు, మాజీ వార్డు సభ్యుడు పూజారి కృష్ణ, ఆరెపల్లి రాజబాబు, చకినారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :