వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు సెలబ్రిటీల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామివార్లను దర్శించుకున్న తర్వాత ప్రముఖుల దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని భక్తులు,స్థానిక ప్రజలు అభిప్రాయాలు వెక్తం చేస్తూన్నారు.ఈరోజు శనివారం ఉదయం హైదరాబాద్ తన నివాసం నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని(భీమన్న గుడిలో) దర్శించుకునేందుకు . ఉదయం 10:00 గంటలకు మున్నూరు కాపు సత్ర భవనం చేరుకుంటారు. అక్కడి నుండి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారుమెగా బ్రదర్స్(మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,నాగబాబు)మేనల్లుడు,హీరో సాయి ధర్మ తేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు సాయిధర్మ తేజ్ యువత జాతీయ అధ్యక్షుడు కాసరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సినీ హీరో,జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నుంచి.. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంటున్నారు.
Reporter
వాస్తవ గమ్యం