వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిల్ల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్య, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.బాల్య వివాహాల నిరోధం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్యపానానికి దూరంగా ఉండటం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సద్వినియోగంపైనా చర్చించారు. వెనుకబడిన గ్రామాల్లో అక్షరం విలువ తెలియజేసేందుకు యూత్ సభ్యులు అక్షర చైతన్య యాత్ర చేపట్టినట్లు అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తెలిపారు.అనంతరం చిన్నారులకు పలక, బలపం అందించి అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు, యువ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం