వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’కార్యక్రమంలో భాగంగా సింగరేణి మందమర్రి ఏరియాలో మంగళవారం ‘మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్’ నిర్వహించారు. ఏరియా నర్సరీ ప్రాంగణంలో జీఎం ఎన్. రాధాకృష్ణ మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సింగరేణి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఉద్యోగి మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు 500 మొక్కలు నాటారు. అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం