వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట చెరువును చిత్తడి నేల గా ప్రకటించేందుకు తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అటవీ, రెవెన్యూ, మత్స్య, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.చెరువు దాదాపు 132 ఎకరాల్లో విస్తరించి ఉంది వలస పక్షులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలయం. స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆవాసాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.చిత్తడి నేలగా గుర్తింపు పొందితే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరవుతాయి. దీనివల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.దీని ఫై గ్రామస్థులకు, అన్ని సంబంధిత శాఖల అధికారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి సమావేశం కంటే ముందే పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం