వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, శ్రీ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించినందుకు గాను ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దావ స్వాతి-రమేష్ బాబు పాల్గొని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ద్వారా ఆర్యవైశ్య సమాజానికి ముఖ్యమంత్రి సముచిత గౌరవం కల్పించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని కులాలు, వర్గాలకు సమాన న్యాయం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం