వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వేసవి సెలవులను పురస్కరించుకుని సింగరేణి యజమాన్యం మందమర్రి ఏరియాలోని కార్మిక, కార్మికేతర పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. స్థానిక సి.ఈ.ఆర్ క్లబ్ లోని స్విమ్మింగ్ పూల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.అత్యుత్తమ శిక్షణ పొందిన కోచ్ సాయిరాజ్ ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగుతోంది. వారికి సహాయకులుగా రాజేశం, రాజేందర్ మరియు ఇతర సిబ్బంది పిల్లలకు ఈతలో మెళకువలను నేర్పిస్తున్నారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలతో ఈ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.పిల్లల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచ్ల వారీగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఉదయం: మొదటి బ్యాచ్ (6:00 - 7:00), రెండో బ్యాచ్ (7:00 - 8:00)సాయంత్రం మూడో బ్యాచ్ (4:00 - 5:00), నాలుగో బ్యాచ్ (5:00 - 6:00)బాలికలకు ప్రత్యేకం: ఉదయం 8:30 గంటలకు బాలికల కోసం ప్రత్యేక బ్యాచ్ కేటాయించారు.ఈ అద్భుతమైన అవకాశాన్ని సింగరేణి కార్మికుల మరియు స్థానిక ప్రజల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సాయిరాజ్ మరియు సిబ్బంది కోరారు. ఈ వేసవిలో పిల్లలు శారీరక దృఢత్వంతో పాటు ఈత వంటి ఆవశ్యక విద్యను నేర్చుకోవడానికి ఇది మంచి వేదిక అని వారు పేర్కొన్నరు
Admin
వాస్తవ గమ్యం