Vastava Gamyam - తెలంగాణ / : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె.హరిత అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా విమర్శించారు.ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, రూ.500కే గ్యాస్ అని చెప్పి ఒక్క లబ్ధిదారుడికీ పూర్తి ప్రయోజనం కల్పించలేదని ఆరోపించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, నియోజకవర్గానికి నిధులే రావడం లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ఏ పని పూర్తి కాలేదని నిలదీశారు.ప్రజాప్రతినిధులకు గౌరవం లేని చోట మేము ఉండలేము అని మాట్లాడుతుండగా ఆర్ డి ఓ జోక్యం చేసుకుని సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Admin
Vastava Gamyam