Saturday, 13 June 2026 09:40:00 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల మోసపూరిత మాటలు నమ్మకండి.

హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య

Date : 13 May 2026 01:24 PM Views : 939

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులను ఐఎన్‌టీయూసీ,ఏఐటీయూసీ సంఘాలు తమ అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియా సిసిసిలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన "జగన్ పార్టీ" (విభాగం) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ, 2023 ఎన్నికల తర్వాత గెలిచిన సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయని విమర్శించారు.ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం.మారుపేర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆగిపోవడం.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించకపోవడం.కార్మికులపై పడుతున్న భారీ ఇన్‌కమ్ టాక్స్ భారాన్ని తగ్గించడంలో విఫలం కావడం.కొత్త బొగ్గు గనుల ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించడం.రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన ₹51 వేల కోట్ల బకాయిలపై నోరు మెదపకపోవడం.అసత్య ప్రచారాలను మానుకోవాలి అని అన్నారు.గత రెండున్నరేళ్లుగా పైరవీలతో కాలక్షేపం చేసిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో యాజమాన్యం తమ డిమాండ్లకు ఒప్పుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి" అని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నిజంగానే యాజమాన్యం డిమాండ్లను అంగీకరిస్తే, సింగరేణి సీఎండీ లేదా డైరెక్టర్లు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి, సమస్యలు తీరిపోయాయని చెప్పడం కార్మికులను వంచించడమేనని పేర్కొన్నారు.సింగరేణిలో సమస్యల పరిష్కారానికి 'సమ్మె' ఒక్కటే మార్గమని, ఆ దిశగా అడుగులు వేయాలని సారయ్య సూచించారు. నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిలోని అన్ని రిజిస్టర్డ్ సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు మీసాల మహేందర్, నామాల శ్రీనివాస్, సందీప్ గౌడ్, చెవుల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, వంశీకృష్ణ, తులా అనిల్ కుమార్, అనిల్ అడ్డూరి మరియు ఇతర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :