వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీకి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను ప్రభుత్వం నేరుగా కేటాయించడంపై మందమర్రి ఏరియాలో సోమవారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి చరిత్రలోనే కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కేటాయింపుతో సంస్థ సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని, బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమానికి ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.సింగరేణి అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన, కొత్త బొగ్గు బ్లాక్ ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సంస్థకు దీర్ఘకాలిక స్థిరత్వం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విజయోత్సవాల్లో భాగంగా మందమర్రి ఏరియా పరిధిలోని అన్ని గనులు, వివిధ విభాగాల కార్యాలయాల్లో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎస్వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ ప్రతినిధి సరిత, డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ ఆర్. సత్యనారాయణతో పాటు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం