Saturday, 12 September 2026 05:50:08 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.

మందమర్రి ఏరియాలో ఘనంగా విజయోత్సవాలు

Date : 13 July 2026 05:23 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీకి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను ప్రభుత్వం నేరుగా కేటాయించడంపై మందమర్రి ఏరియాలో సోమవారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి చరిత్రలోనే కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కేటాయింపుతో సంస్థ సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని, బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమానికి ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.సింగరేణి అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన, కొత్త బొగ్గు బ్లాక్ ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సంస్థకు దీర్ఘకాలిక స్థిరత్వం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విజయోత్సవాల్లో భాగంగా మందమర్రి ఏరియా పరిధిలోని అన్ని గనులు, వివిధ విభాగాల కార్యాలయాల్లో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ ప్రతినిధి సరిత, డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ ఆర్. సత్యనారాయణతో పాటు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: