వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు మొదలయ్యాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్ (నటుడు, రాజకీయ నాయకుడు విజయ్) హిందూ దేవాలయాల నిధుల వినియోగంపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత డీఎంకే ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెడుతూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.గతంలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీఎంకే ప్రభుత్వం హిందూ దేవాలయాలకు సంబంధించిన రూ. 246 కోట్ల నిధులతో సుమారు 46 ఇతర ప్రాజెక్టులను నిర్మించాలని తలపెట్టింది. అయితే, సీఎం విజయ్ ఆ 46 ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిధులు ఆలయాలకే పరిమితం.హిందూ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయం మరియు నిధులను కేవలం హిందూ దేవాలయాల పునర్నిర్మాణానికి, అన్నదాన కార్యక్రమాలకు మరియు ఆలయాల అభివృద్ధి వ్యవహారాలకు మాత్రమే ఉపయోగించాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకూడదని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో స్టాలిన్ మరియు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ హిందూ ధర్మంపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో హిందువులు, వివిధ ఆలయ కమిటీలు మరియు హిందూ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటలకే పరిమితం కాకుండా విజయ్ ఆచరణలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం