వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టరేట్, సోయంగూడ ఆవాస గ్రామాల్లో బుధవారం ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ పర్యటించి గ్రామస్థులతో సమావేశమయ్యారు. ప్రధానంగా త్రాగునీటి సమస్యను గ్రామస్థులు దృష్టికి తీసుకురాగా, వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో వాంకిడి మండల కాంగ్రెస్ నాయకులు, ఉప సర్పంచ్ దీపక్ ముండే, సీనియర్ నాయకుడు ఎం.డీ. నిజాం, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం