Tuesday, 28 July 2026 05:30:10 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే మూడో కన్ను: వ్యాపారస్తులకు సీఐ రమేష్ పిలుపు

Date : 08 July 2026 06:14 PM Views : 221

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు వ్యాపారస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మందమర్రి సీఐ రమేష్, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు, వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు అవసరాన్ని వివరించారు.సీఐ రమేష్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రతి వ్యాపారస్తుడు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కెమెరాలు ఉండడం వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు తగ్గడమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించి కేసులను వేగంగా ఛేదించేందుకు సీసీ ఫుటేజ్ పోలీసులకు "మూడో కన్ను"లా ఉపయోగపడుతుందని తెలిపారు.దుకాణాల వద్ద ఒక కెమెరా లోపలి భాగాన్ని, మరొకటి రోడ్డుపై వెళ్లే వాహనాలు, వ్యక్తులు స్పష్టంగా కనిపించేలా బయట వైపునకు అమర్చాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వ్యాపార సంస్థల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: