వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : భీమారం మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో వీణ ను మండలంలోని పలు గ్రామపంచాయతీ సర్పంచులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీవోను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మండలంలోని గ్రామాలలో పెండింగ్ లో ఉన్న పనులు, ప్రజల సమస్యల గురించి సత్వర చర్యలు తీసుకోవాలని భీమారం మండల అభివృద్ధిలో భాగం కావాలని కోరారు.
Reporter
వాస్తవ గమ్యం