వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల చేపట్టిన పైప్లైన్ మరమ్మత్తుల కారణంగా అప్రోచ్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిన విషయం స్థానిక మార్కెట్ వాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మంద తిరుమల్ రెడ్డి సమస్యను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మున్సిపల్ ఇంజినీర్ గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.ఈసందర్భంగా పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి అధికారులు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి అవసరమైన మరమ్మత్తులు చేపట్టడంతో పాటు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.దీంతో మార్కెట్ వాసులు సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం