Tuesday, 28 July 2026 08:04:24 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మార్కెట్ రోడ్డు పరిశీలన

Date : 07 July 2026 05:58 PM Views : 82

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఇటీవల చేపట్టిన పైప్‌లైన్ మరమ్మత్తుల కారణంగా అప్రోచ్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిన విషయం స్థానిక మార్కెట్ వాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన మంద తిరుమల్ రెడ్డి సమస్యను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ రాజలింగం దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజలింగం, మున్సిపల్ ఇంజినీర్ గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు.ఈసందర్భంగా పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి అధికారులు దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి అవసరమైన మరమ్మత్తులు చేపట్టడంతో పాటు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.దీంతో మార్కెట్ వాసులు సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :