Tuesday, 28 July 2026 08:04:49 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ధూపదీప నైవేద్య అర్చకులను కించపరచడం సారి కాదు.

మాదిరాజు మధు శర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆగ్రహం

Date : 08 July 2026 09:53 PM Views : 308

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ధూపదీప నైవేద్య అర్చకులను ఉద్దేశించి చేసిన అవమానకర వ్యాఖ్యలను రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఒక పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర శర్మ.చిన్న గుడులలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించే అర్చకులను కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరం అని ఆయన మండిపడ్డారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఏ దేవాలయంలోనైనా ఆరాధన క్రమం ఒకటే ఉంటుందని, భగవంతుడికి సేవ చేసే అర్చకులలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 6,575 మంది ధూపదీప నైవేద్య అర్చకుల మనోభావాలను దెబ్బతీసిన ఉపేంద్ర శర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పిలుపు మేరకు.. ఒకవేళ ఉపేంద్ర శర్మ క్షమాపణలు చెప్పని పక్షంలో, జిల్లాలోని అర్చకులందరినీ సంఘటితం చేసి వేయి స్తంభాల గుడి వద్ద నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్చరించారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :