Tuesday, 28 July 2026 05:30:10 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగ: జీఎం ఎన్. రాధాకృష్ణ

Date : 20 June 2026 02:32 PM Views : 45

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమరి ఏరియాలోని అన్ని గనులు, వివిధ విభాగాలు, జనరల్ మేనేజర్ కార్యాలయంలో యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ మరింత ప్రగతి సాధించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జీఎం కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం యోగ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి గీతిక, యోగా మాస్టర్ శంకర్‌తో పాటు జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: