వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమరి ఏరియాలోని అన్ని గనులు, వివిధ విభాగాలు, జనరల్ మేనేజర్ కార్యాలయంలో యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ మరింత ప్రగతి సాధించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జీఎం కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం యోగ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి గీతిక, యోగా మాస్టర్ శంకర్తో పాటు జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం