వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : స్థానిక మందమర్రి హరిహర దేవస్థాన ప్రాంగణంలో సంతోషి మాత వ్రత ఉద్వాసన మహోత్సవం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. గత కొన్ని వారాలుగా నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి పంచా మృతాభిషేకం నిర్వహించి, విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు, మహా పూర్ణాహుతి హోమం శాస్త్రోక్తంగా సాగాయి. ఉద్వాసన క్రతువులో భాగంగా వ్రతమాచరించిన భక్తులు అమ్మవారి కథా శ్రవణం చేసి, కన్యకా పూజలు నిర్వహించి చిన్నారులకు దక్షిణ తాంబూలాలు అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, కాలనీ పెద్దలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Admin
వాస్తవ గమ్యం