వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎలగతి సుచిత్ అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే పిలుపు మేరకు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షకు పలువురు బీజేపీ నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల. భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నారని రాష్ట్రంలో విద్యార్థుల చదువులతో ఆడుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తక్షణమే బకాయిలు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని రాష్ట్రంలోని 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో , బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు బోనగిరి సతీష్ బాబు,విశాల్ కాండ్రే, సప్త శ్రీనివాస్, కోవా విజయ్, బీజేవైమ్ జిల్లా నాయకులు ఇగురపు సంజీవ్, సప్త శ్రీనివాస్ మరియు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం