వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. శనివారం రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ గౌడ్ అధ్యక్షతన మండల కమిటీ ఎన్నిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ ఎన్నికకు సంబంధించి నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల కమిటీని పార్టీ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసి, సంఘటన్ శ్రీజన్ అభియాన్ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్ రావు, జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కార్యదర్శి చిరంజీవి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చేన్న సోమశేఖర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఏలగల సాయికుమార్, సీనియర్ నాయకులు బలరాం నాయక్,గోపాల్ నాయక్, ఈశ్వర్ నాయక్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం