Tuesday, 28 July 2026 03:22:29 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

దళితులపై పెత్తందారుల దౌర్జన్యం బుట్టరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్

Date : 02 May 2026 04:59 PM Views : 128

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో దళితులపై జరుగుతున్న పెత్తందారుల దౌర్జన్యాలను అరికట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. శనివారం రొయ్యలపల్లి గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.గ్రామానికి చెందిన రావుల సుజాత, జీవన్ దంపతులు తాము కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన గోడిసెల బుట్టరెడ్డి, అతని భార్య సమ్మక్క కలిసి ఆ పిల్లర్ రాడ్లను కూల్చివేశారు. ఈ క్రమంలో బాధితులను కులం పేరుతో దూషిస్తూ అరాచకానికి పాల్పడ్డారని రవి ఆరోపించారు. రాజకీయ కక్షల నేపథ్యంలో దళితులను లక్ష్యంగా చేసుకుని బుట్టరెడ్డి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పెత్తందారులకు ఊడిగం చేస్తున్న కోటపల్లి ఎంపిడిఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వల్లే పెత్తందారులకు బలం చేకూరుతోందని విమర్శించారు.లేని పక్షంలో కార్మిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంకె రవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, ఆత్రం సంపత్, దుర్గం గంగారాం, దుర్గ మహేష్, బాధితులు రావుల సుజాత, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: